ముంబయి: కళ్లకు కనిపించకుండా చాప కింద నీరులా కరోనా వ్యాధి వ్యాపిస్తోంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది. ఎప్పుడు, ఎటు నుంచి ఏ రూపంలో సోకుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని అభిషేక్ బచ్చన్ వెల్లడించారు.
“మా కోసం మీరు చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఐశ్వర్య ఆరాధ్య లకు చేసిన కరోనా టెస్టులో నెగిటివ్ ఫలితం వచ్చింది. వారిద్దరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నేను మా నాన్న వైద్యుల సంరక్షణలోనే ఉన్నాము”. అంటూ అభిషేక్బచ్చన్ ట్వీట్ చేశారు.