ఆమె అకౌంట్లో 200 కోట్లు :: ఆదాయపన్ను శాఖ అధికారుల నోటీసులు.

ముంబై :: 81 సంవత్సరాల వృద్ధురాలి బ్యాంక్ అకౌంట్లో రెండు వందల కోట్లు ఉన్నట్లు తెలిసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్విజర్లాండ్ లోని హెచ్ ఎస్ బి సి బ్యాంకు తమ బ్యాంకు  లోని ఖాతాల వివరాలు  అనేక దేశాల ప్రభుత్వాలకు సమాచారము అందించింది. ఆ మేరకు 200 కోట్ల రూపాయలకు పన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమెకు నోటీసు పంపారు. ఆమె ప్రస్తుతం ఒక లక్షా 70 వేల రూపాయల ఆదాయపన్ను మాత్రం చెల్లిస్తున్నారు.