డిసెంబరు ఒకటి నుంచి ఫాస్ట్ట్యాగ్ ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం
ఒక వాహనం టోల్ప్లాజా దాటడానికి కనిష్ఠంగా పది నిమిషాలు పడుతోంది. పండగ, రద్దీ సమయాల్లో అరగంట వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అదేవిధంగా టోల్ రుసుము నగదు రూపంలో చెల్లిస్తుండటం, సరిపడా చిల్లర లేకపోవడం ఆలస్యానికి కారణం అవుతోంది. దీన్ని నివారించేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబరు ఒకటి నుంచి ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టోల్ప్లాజా యాజమాన్యాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద వాహనదారులకు బుధవారం అవగాహన కల్పించారు.

హైదరాబాద్:
ఫాస్ట్ట్యాగ్ స్టిక్కర్ను వాహనం ముందు భాగంలో అద్దంపై అతికించాలి. గేటు వద్దకు వాహనం రాగానే ‘ఈటీసీ’ కెమెరాలు స్కాన్ చేస్తాయి. దీంతో గేటు ఆటోమేటిక్గా తెరుచుకొంటుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం రెండు గేట్ల వద్ద అమలవుతోంది. డిసెంబరు ఒకటి నుంచి మరో 6 గేట్ల వద్ద అమలు చేయనున్నారు. వాహనదారులంతా తప్పనిసరిగా తమ వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ స్టిక్కర్లు వేయించుకోవాల్సి ఉంటుంది.
స్టిక్కర్లు ఎక్కడిస్తారంటే
ఫాస్ట్ట్యాగ్ అమల్లో భాగంగా జాతీయ రహదారుల సంస్థ ‘మై ఫాస్ట్ట్యాగ్’, ‘ఫాస్ట్ట్యాగ్ పార్టనర్’ యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనదారులు తమ బ్యాంకు ఖాతాతో ఈ యాప్ను అనుసంధానం చేసుకొని నిర్ణీత సొమ్మును చెల్లించాలి. ఆ వివరాలు ఎంపిక చేసిన బ్యాంకుల్లో లేదా టోల్ప్లాజాలో ఇస్తే ‘ఫాస్ట్ట్యాగ్ బార్కోడ్’తో కూడిన ఒక ఫ్రీపెయిడ్ స్టిక్కర్ ఇస్తారు.
లోపాలు సవరిస్తేనే
-ఇప్పటికే ఫాస్ట్ట్యాగ్ వినియోగించే వాహనదారులు కొన్ని లోపాలను ఎత్తి చూపుతున్నారు. వాటిని సరిచేయాలని కోరుతున్నారు.
-ముందస్తు టోల్ రుసుం చెల్లిస్తే సమయంతో పాటు క్యాష్బ్యాక్ ఆఫర్లు పొందవచ్చని ప్రచారం చేస్తున్నారు ఇది ఎంత వరకు సమంజసమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
-24 గంటల్లో తిరుగు ప్రయాణమయ్యే వారు మాత్రం నష్టపోవాల్సి వస్తోంది… నగదు చెల్లింపుతో 24 గంటల్లో తిరుగు ప్రయాణమయ్యేవారికి కొంత రాయితీ ఉంటుంది. ముందస్తు చెల్లింపులతో పూర్తి ఛార్జీ వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్లు : 5,000
చిన్న లారీలు : 3,000
బస్సులు : 1,000
కేంద్ర ప్రభుత్వ ఆదేశాను సారం డిసెంబరు ఒకటో తేదీ నుంచి టోల్ ప్లాజాను ఫాస్ట్ ట్యాగ్ సేవలు కొనసాగించనున్నట్లు టోల్ ప్లాజా మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు. ఇకపై జాతీయ రహదారిలో ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వాహన రాకపోకలు సాగించే వాహనదారులకు రెట్టింపు టోల్ రుసుము వసూలు చేయబడుతుందన్నారు. టోల్ప్లాజాలో నగదు రూపంలో చెల్లిస్తే చెల్లించాల్సిన దాని కన్నా రెట్టింపు వసూలు చే సేందుకు రంగం సిద్ధం చేశారు. డిసెంబర్ ఒకటో తేది నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్టాన్రిక్ టోల్ కనెక్షన్ విధానంలో టోల్ ఛార్జీలు సరి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులు సమయం, ఇంధనం ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అ ధికార వర్గాలు వెల్లడించాయి. ఫాస్ట్ ట్యాగ్ విధానం డిసెంబర్ ఒకటో తేది నుంచి తప్పనిసరి చేసేందుకు టోల్ ప్లాజా యాజమా న్యాలకు ఆదేశాలు జారీచేయబడుతాయని తెలిపారు. ఈ మేరకు ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ప్లాజా యాజమాన్యం గురువారం అవగాహన కల్పించారు. తెలంగాణ నుంచి వెళుతున్న అం తర్జాతీయ రహదారులకు, జాతీయ రహదారులకు చెందిన టోల్ఫ్లాజాలలో ఈ విధానం అ మలులోకి రానుంది. రాష్ట్రంలో 17 ప్రధాన మార్గాల్లో టోల్ ప్లాజాలు ఉన్నాయి. టోల్ప్లాజాకు చెల్లించాల్సిన రుసుముకు సంబంధించి ప్రభుత్వం ఎలక్టాన్రిక్ స్టిక్కర్ ను రూపొందించింది. వాహనదారులు దీనిని పొందేందుకు జాతీయ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో పాటు టోల్ ప్లాజా కార్యాలయా ల్లో వాహనదారుడికి సంబంధించిన వాహన సంబం?ధిత పత్రాలు అందజేయాల ని తెలిపారు. జాతీయ రహదారుల సంస్థ ప్రత్యేక యాప్లతో రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. టోల్ప్లాజా యాజమాన్యం అందజేసిన స్టిక్కర్ వాహనం ముందు భాగంలో అద్దంపై అతికించాలన్నారు.. యాప్ను రీచార్జ్ చేసుకుంటే వాహనం టో ల్ ప్లాజా దాటేసమయంలో పైన అమర్చిన సీసీ కెమెరాలు వాహనంపై ఉన్న ట్యాగ్ను స్కాన్ చేయడంతో ఆటోమేటిక్గా రుసుము టోల్ఫ్లాజకు వెళుతుంది. ఇలా చేయడంతో టోల్ఫ్లాజలో వాహనం నిలపాల్సిన అవసరం లేకుండా సమ యం, ఇందనం ఆదా అవుతుందన్నారు. ఇందల్వాయి టోల్ఫ్లాజలో అవగాహన కోసం రెండు గేట్ల వద్ద ఈ సిస్టం అమలవుతుంది. డిసెంబర్ ఒకటి నుంచి మరో ఆరు గేట్ల వద్ద అమలుచేయనున్నామని ప్రాజెక్టు మేనేజర్ తెలిపారు.
ఫాస్ట్ట్యాగ్ అంటే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ గేట్ల వద్ద ఫీజు వసూలు చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్-ముంబై రహదారిపై ఫాస్ట్ట్యాగ్ లేన్ ప్రారంభించారు. అక్కడ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఇతర జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేన్లను ప్రారంభించింది. భారతదేశంలోని 500 పైగా టోల్ ప్లాజాల్లో మొదలుపెట్టనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వాహనదారుల సేవింగ్స్ అకౌంట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరిగిపోతుంది. టోల్ ఛార్జీ చెల్లించేందుకు వాహనాన్ని ఆపాల్సిన అవసరం లేకపోవడంతో రద్దీ కూడా ఉండదు. ఫాస్ట్ ట్యాగ్ను టోల్ గేట్ల దగ్గర, బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు. పేటీఎం, అమెజాన్ లాంటి యాప్స్, పెట్రోల్ బంకుల్లో కూడా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు.
ఫాస్ట్ట్యాగ్ సిమ్కార్డును తీసుకోవడానికి ఆరు ప్రధాన బ్యాంకుల్లో అవకాశం కల్పించారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజా నిర్వహకులు ఒక్కొక్కరు ఒక్కోక్క విధానాలు అమలు చేస్తున్నారు. దీంతో వారికి అనుబంధంగా ఉన్న ఆరు బ్యాంకుల్లో ఏదో ఒక దాంట్లో నుంచి ఫాస్ట్ట్యాగ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముందుగానే కొంత నగదు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో ఆ ఖాతా నుంచి కొంత నగదు కట్ అవుతున్న క్రమంలో మళ్లి వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మొదట కొంత ఇబ్బంది ఉన్న తర్వాత సులువు కానుంది. టోల్ప్లాజా దగ్గర చిల్లర కోసం ఇతర కారణాల వల్ల గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుకుపోయే కంటే ఇది చాలా సువులుగా ఉంటుంది. ఈ పద్ధతి వల్ల వచ్చిన ప్రతి వాహనం సెకెండ్లలో టోల్గేట్ను దాటివెళ్తోంది. దీంతో సమస్యలు ఉత్పన్నం కావు.
ఆన్లైన్ చెల్లింపులు ఇలా..
ఫాస్ట్ట్యాగ్ స్టిక్కర్ను వాహనం ముందు భా గంలో అద్దంపై అతికించాలి. గేటు వద్దకు వా హనం రాగానే ఈటీసీ కెమెరాలు స్కాన్ చేస్తా యి. దీంతో గేటు ఆటోమెటిక్గా ఓపెన్ అవుతా యి. అడ్డాకుల, రాయికల్ టోల్ప్లాజా దగ్గర డి సెంబర్ 1నుంచి అమల్లోకి తెస్తారు. ఫాస్ట్ట్యాగ్ అమల్లో భాగంగా జాతీయ రహదారుల సంస్థ మై ఫాస్ట్ ట్యాగ్, ఫాస్ట్ట్యాగ్ పా ర్టనర్ యాప్లను అందుబాటులోకి తీ సుకొచ్చింది. వాహనదారులు తమ బ్యాంకు ఖాతాలో ఈ యాప్ను అనుసంధానం చేసుకొని నిర్ణీత సొమ్మును చెల్లించాలి. ఆ వివరాలు ఎంపిక చేసిన బ్యాంకుల్లో లేదా టోల్ప్లాజా ఇస్తే ఫాస్ట్ట్యాగ్తో కూడిన ఒక ఫ్రీపెయిడ్ స్టిక్కర్ ఇస్తారు.
ఇకపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు
ఫాస్ట్ట్యాగ్ విధానంతో టోల్ప్లాజా దగ్గర ట్రాఫిక్ జాం కాదు. దీంతో పాటు నగదు రహిత సేవలు కూడా అమల్లోకి వస్తాయి. ఇంధనం, సమయం, పొల్యూషన్ చాలా వరకు ఆదా చేయవచ్చు. ఈ విధానం తీసుకురావడం వల్ల వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది.