నమో..నర్మద

పుట్టినరోజు సందర్భంగా నర్మదానదికి ప్రత్యేక పూజలు చేసిన మోదీ 
  • నిరాడంబరంగా 69వ పుట్టినరోజు వేడుక 
  • శాస్త్రోక్తంగా నదీమ తల్లికి పూజలు 
  • నమామి దేవి నర్మద మహోత్సవంలో భాగంగా హారతి 
  • తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న మోదీ 
  • రూ.501 బహుమతిగా ఇచ్చిన హీరాబెన్‌ 
  • స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ సందర్శన 
  • కోట్లు పలికిన మోదీ వేలం కానుకలు 
  • నమామి గంగ ప్రాజెక్టుకు త్వరలోనే విరాళం 

ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మంగళవారంనాడు 69వ పుట్టినరోజు జరుపుకొన్నారు. కెవడియాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను సందర్శించి నర్మదా నదికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, నదిలో పూలు వదిలారు. నదీమ తల్లికి హారతి పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నమామి దేవి నర్మద మహోత్సవ్‌’లో భాగంగా ఈ పూజా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ఎత్తును 138.68 మీటర్లు పెంచిన తర్వాత తొలిసారి పూర్తిగా నీటితో నింపారు. అంతకుముందు, కవడియాలోని కాక్టస్‌ గార్డెన్‌, బట్టర్‌ ఫ్లై గార్డెను మోదీ సందర్శించారు. సీతాకోక చిలుకలను ఎగురవేస్తూ సందడి చేశారు. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని సందర్శించి సర్దార్‌ పటేల్‌కు నివాళులర్పించారు. 

కెవడియా: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మంగళవారంనాడు 69వ పుట్టినరోజు జరుపుకొన్నారు. కెవడియాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను సందర్శించి నర్మదా నదికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, నదిలో పూలు వదిలారు. నదీమ తల్లికి హారతి పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నమామి దేవి నర్మద మహోత్సవ్‌’లో భాగంగా ఈ పూజా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ఎత్తును 138.68 మీటర్లు పెంచిన తర్వాత తొలిసారి పూర్తిగా నీటితో నింపారు. 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు 69వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్లిన ప్రధాని.. తన తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 98ఏళ్ల హీరాబెన్‌ తన చిన్న కుమారుడు పంకజ్‌ మోదీతో కలిసి గాంధీనగర్‌ సమీపంలోని రైసిన్‌ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ మధ్యాహ్నం అక్కడకు వెళ్లిన ప్రధాని మోదీ.. తల్లితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇరుగుపొరుగు వారితో కాసేపు సరదాగా గడిపారు. 
అంతకుముందు నర్మద జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌, ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ గరిష్ఠ నీటిమట్టాన్ని తాకిన సందర్భంగా ‘నమామీ దేవి నర్మదే మహోత్సవ్‌’ పేరుతో ఉత్సవాన్ని మోదీ ప్రారంభించారు. డ్యామ్‌ వద్ద ప్రత్యేక పూజలు చేసి నర్మదానదికి హారతి ఇచ్చారు. 
అంతకుముందు, కవడియాలోని కాక్టస్‌ గార్డెన్‌, బట్టర్‌ ఫ్లై గార్డెను మోదీ సందర్శించారు. సీతాకోక చిలుకలను ఎగురవేస్తూ సందడి చేశారు. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని సందర్శించి సర్దార్‌ పటేల్‌కు నివాళులర్పించారు. గత ఏడాది అక్టోబర్‌ 31న పటేల్‌ జయంత్యుత్సవం సందర్భంగా స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని వెంట గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని తన పర్యటన ముగించుకుని సాయంత్రం ఢిల్లీకి బయలుదేరే ముందు తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు అందుకున్నారు. 
కాగా, సోమవారం రాత్రి అహ్మదాబాద్‌ చేరుకున్న మోదీకి సీఎం, గవర్నర్‌ సాదర స్వాగతం పలికారు. ప్రధాని రాకను పురస్కరించుకుని కెవడియాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుద్దీపాలు, అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 
. గత ఏడాది అక్టోబర్‌ 31న పటేల్‌ జయంత్యుత్సవం సందర్భంగా స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని వెంట గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని తన పర్యటన ముగించుకుని సాయంత్రం ఢిల్లీకి బయలుదేరే ముందు తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు అందుకున్నారు. కాగా, గత రాత్రి అహ్మదాబాద్‌ చేరుకున్న మోదీకి సీఎం, గవర్నర్‌ సాదర స్వాగతం పలికారు. ప్రధాని రాకను పురస్కరించుకుని కెవడియాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుద్దీపాలు, అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 
కోటి పలికిన మోదీ కానుకలు 
గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కానుకగా ఇచ్చిన వెండి కలశం వేలంలో రూ. కోటిపైనే పలికింది. మోదీ చిత్రంతో ఉన్న ఫొటో స్టాండ్‌ కూడా రూ.కోటికి అమ్ముడుపోయింది. దేశ, విదేశాల పర్యటనల సందర్భంగా ప్రధానికి వచ్చిన జ్ఞాపికలు, కానుకలను ఆన్‌లైన్‌ ద్వారా వేలం వేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 14 నుంచి ఈ ఇ-వేలం ప్రారంభమైంది. 
ఇందులో గుజరాత్‌ సీఎం రూపానీ ఇచ్చిన వెండి కలశం రూ. 1,00,00,300 పలికింది. ప్రారంభ ధర రూ. 18వేలతో ప్రారంభమైన వెండి కలశం వేలం సెప్టెంబరు 16తో ముగిసింది. వేలంలో ఈ కలశం ఐదు రెట్లు ఎక్కువకు అమ్ముడుపోవడం విశేషం. ఇక ప్రధాని చిత్ర పటంతో ఉన్న ఫొటో స్టాండ్‌ను రూ. 500 ప్రారంభ ధరతో వేలానికి పెట్టగా.. ఏకంగా రూ. 1,00,00,100 పలికింది. లేగదూడతో ఉన్న ఆవు విగ్రహం ఈ-వేలంలో రూ. 51లక్షలకు అమ్ముడైపోయింది. 
మోదీకి వచ్చిన 2,700లకు పైగా కానుకలు, జ్ఞాపికలను సెప్టెంబరు 14 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వేలానికి పెట్టారు. అక్టోబరు 3 వరకు ఈ ఇ-వేలం కొనసాగుతుంది. ఆసక్తి ఉన్నవారు వెబ్‌సౖౖెట్‌ను సందర్శించి వేలంలో పాల్గొనవచ్చు. ఇలా సమకూరిన మొత్తాన్ని గంగా ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగ కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నారు. కాగా.. మోదీ కానుకలకు వేలం వేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య 1800కు పైగా మోదీ బహుమతులకు వేలం నిర్వహించి ఆ మొత్తాన్ని నమామీ గంగ ప్రాజెక్టుకు అందజేశారు.