ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి :: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు.

విభారె న్యూస్ సెప్టెంబరు 20 ఆళ్ళగడ్డ :- ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని పరిరక్షించాలని రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు అన్నారు. స్వేచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా శుక్రవారం నరసాపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల ద్వారానే స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. మానవుని స్వార్ధ అవసరాల కోసం చెట్లను నరుక్కుంటూ పోతున్నారని, ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్క మొక్కనైనా నాటి పరిరక్షించాలన్నారు. గాంధీ జయంతికి 15 రోజులు ముందునుంచే గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామపరిసరిలను ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని సేవా కార్యక్రమాల్లో భాగంగా పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ నాగరాజు, రాజ్యలక్ష్మి, సర్పంచ్ శాంతకుమారి, ఫకీరయ్య, అటవీ శాఖ సిబ్బంది శ్రీనివాసులు రెడ్డి, మక్తల్ భాష ,రాణెమ్మ, రామకృష్ణ, నాగేంద్రయ్య, మహబూబ్ ఖాన్, సురేంద్ర గౌడ్, నరసింహారెడ్డి, జేమ్స్ పాల్, సుభాష్, మదన్ గోపాల్, హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.