ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్):: ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్రాంత సైనికుల కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు న్యాయవాది, ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్రాంత సైనికుల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసుకున్న నూతన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవలో అలసిపోయిన దేశభక్తులకు ఆరోగ్యము,మానసిక ఉల్లాసము కలిగించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు