శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి భక్తులకు వడ ప్రసాదం మళ్లీ అందుబాటులోకి :: కార్యనిర్వహణాధికారి లవన్న.

శ్రీశైలం జూన్ 16 విభారె న్యూస్.
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులకు సౌకర్యార్ధం దేవస్థానం వడ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రసాదాల విక్రయ కేంద్రాల ద్వారా లడ్డు, పులిహోర ప్రసాదాలతో పాటు ఇక నుండి భక్తులు వడ ప్రసాదాన్ని కూడా కొనుగోలుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న అందుబాటులోకి తెచ్చారు 45 గ్రాముల గల ఈ వడ ప్రసాదం ధర రూ 20 లుగా దేవస్థానం నిర్ణయించింది గతంలో వడను దేవస్థానం విక్రయించిన అనివార్య కారణాలవల్ల నిలుపుదల అయినది.శుక్రవారం మళ్లీ వడ ప్రసాద విక్రయం ప్రారంభ సందర్భంగా ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపటానికి పూజాదికాలు జరిపి వడ ప్రసాద విక్రయాలు కార్యనిర్హణాధికారి లవన్న ప్రారంభించారు. ఈ వడను దేవస్థానం ఈవో ఎస్.లవన్న స్వయంగా వడ ప్రసాదాలను కొనుగోలు చేసి విక్రయాలను ప్రారంభించి ఈవో లవన్న మాట్లాడుతూ భక్తుల రద్దీకనుగుణంగా ఎప్పటికప్పుడు వడ ప్రసాదాలను తయారు చేస్తూ భక్తులకు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో లవన్న ఆదేశించారు.