ఆళ్లగడ్డ :: ఆగస్టు 29 (విభారె న్యూస్) :: ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఆవరణంలో ఈరోజు ఆళ్లగడ్డ గణేష్ ఉత్సవ కేంద్ర సమితి వారు మరియు వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. కమిటీ పెద్దలు వినాయక మంటపాల నిర్వహణలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి పలు సూచనలు ఇవ్వడం జరిగినది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, మంటపం చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శబ్ద కాలుష్యం లేకుండా భక్తిశ్రద్ధలతో ఆనందదాయకంగా వినాయక చవితి జరుపుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు. మంటపాల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే కమిటీ పెద్దలు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలనికోరారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ వేణుగోపాల్ గారు. న్యాయవాదులు నీలకంఠేశ్వరం, మురళీధర్ గౌడ్, బోరెడ్డి లక్ష్మిరెడ్డి, మోహన్ రెడ్డి. దామోదర్ రెడ్డి. సోమల శ్రీనివాసరెడ్డి. గ్యాస్ పుల్లయ్య మండపాలనిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.