అర్బన్ ఎస్ఐ శరత్ కుమార్ కు వివేకానంద చిత్రపటం అందజేత..

విభారే న్యూస్ డోన్ మా ప్రతినిధి :- డోన్ తాలూకా వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఈ నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వారోత్సవాలలో భాగంగా డోన్ సబ్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ రెడ్డి కి స్వామివారి చిత్రపటమును అందజేయడం జరిగినది ఈ సందర్భంగా ఈ నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో శరత్ కుమార్ రెడ్డి వచ్చినప్పటి నుండి ట్రాఫిక్ కంట్రోల్ మటక అక్రమ మధ్యము యు టీజింగ్ కొట్లాటలు గలాటాలు తదితర ఆ సాంఘిక కార్యక్రమాలను చాకచక్యంగా కంట్రోల్ చేస్తూ పౌరులకు మరియు ప్రజలకు మహిళలకు విద్యార్థులకు శాంతి భద్రతలను రక్షించడంలో జిల్లా కే ఆదర్శంగా విధి నిర్వహణను నిర్వహించుచున్నారు.జాతరలో తిరుణాలలో పండుగలు దేవరలు తదితర సామాజిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మంచి సేవలను అందించారు పార్టీలకు అతీతంగా ప్రజలకు రక్షణ కల్పించారు ఆయన సేవలను గుర్తించి స్వామి వివేకానంద వారోత్సవాలలో భాగంగా స్వామివారి చిత్రపటమును అందించడం జరిగినది ఈ కార్యక్రమానికి వినియోగదారుల రక్షణ సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మల్లికార్జున స్వామి డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం మహిళా అధ్యక్షురాలు వనం లక్ష్మీదేవి వినియోగదారుల రక్షణ సంఘం నాయకులుపట్టణ అధ్యక్షుడు దూదేకుల సిద్ధ తదితరులు పాల్గొన్నారు