గుండెపోటుతో లారీ డ్రైవర్ కం ఓనర్ మృతి….

సంతాపం వ్యక్తం చేసిన డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు

విభారే న్యూస్ డోన్ మా ప్రతినిధి :- జనవరి13డోన్ మండల పరిధిలోని కన్నపుకుంట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కం ఓనర్ చాకలి మల్లి (48) గుండెపోటుతో మృతి చెందాడు.ఆయన మృతికి మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు ఏవి.భాస్కర్ రెడ్డి,టి.శివరాం,ఉపాధ్యక్షులు బి.లక్ష్మన్న సంతాపం వ్యక్తం చేశారు.స్థానిక శ్రీనివాస నగర్ లోని మృతుని స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు మల్లి ఆదివారం వేకువజామున నిద్రలోనే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. ఆయన అకాల మరణం బాధాకరమని ఆయన కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.మృతునికి భార్య,ఒక కుమారుడు,ఒక కుమార్తె ఉన్నట్లు వారు తెలిపారు.నివాళులు అర్పించిన వారిలో యూనియన్ కోశాధికారి సుబ్బారెడ్డి,సహాయ కార్యదర్శి హుస్సేన్ పీరా,నాయకులు కిట్టు,గోపాల్,సి.రాము,ఎర్రన్న, నాగరాజు,మద్దిలేటి,తిరుపాలు,మద్దయ్య,
లక్ష్మన్న,చలపతి,రామయ్య,శ్రీనివాసులు,డోన్,కన్నపకుంట తదితర గ్రామాల లారీ డ్రైవర్లు,లారీ ఓనర్లు,డ్రైవర్ కం ఓనర్లు తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.