విశ్వహిందూ పరిషత్ సమావేశ భవనానికి లక్ష విరాళం

విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి జనవరి 09 – పట్టణంలో విశ్వహిందూ పరిషత్ సమావేశ భవనానికి లక్ష రూపాయల విరాళాన్ని నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మదు అందించారు. మంగళవారం టెక్కే సమీపంలోని భరత మాత గుడి సమీపంలో నిర్మాణంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ భవనాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన భవన నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందించారు. సమావేశ భవనం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు .విశ్వహిందూ, బజరంగ దల్ అధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టారని తెలిపారు .తన వంతు సహాయంగా లక్ష రూపాయల నగదును విశ్వహిందూ,భజరంగ్ దళ్ సభ్యులకు అందజేశానని ఆయన అన్నారు