హరిహర దేవాలయంలో ఘనంగా సామూహికంగా గాయత్రీ జప కార్యక్రమం.

విభారె న్యూస్ జనవరి 06 కర్నూలు..
కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘము వారి సహకారముతో కర్నూల్ శతకోటి గాయత్రీ జప బృందం వారిచే కర్నూలు హరిహర దేవాలయములో సామూహిక గాయత్రీ జప కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంధ్యావందనం అభ్యాసన శిక్షణా సమితి హైదరాబాద్ అధ్యక్ష గురుదేవులు అయినా పూజ్యశ్రీ కల్వకొలను శ్రీ రామచంద్రమూర్తి పాల్గొన్నారు.కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘము వారు శ్రీరామచంద్రమూర్తి ని ఘనంగా ఆహ్వానించి శంకర మందిర వేద విద్యార్థులచే వేదాశీర్వచనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కర్నూల్ శతకోటి గాయత్రీ జప కోఆర్డినేటర్ గొల్లాపిన్ని ఫణిరాజ్,కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కళ్ళే చంద్ర శేఖర శర్మ,కార్యదర్శి రాజశేఖరు రావు,ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి మనోహర్ రావు పాల్గొన్నారు.