ప్రజలకు కేంద్ర పథకాల గురించి వివరిస్తామ్

నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు*
విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి జనవరి 06- .బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నీ అమరావతి లో శనివారం కలిసినట్టు నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ
కేంద్ర పథకాలు ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కోరారని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పేర్కొన్నారు.నంద్యాల బీజేపీఅసెంబ్లీ కన్వీనర్ ప్రకటించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నీ గౌరవపూ ర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. .రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశం మేరకు నంద్యాల జిల్లా లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరిస్తున్నామని పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలతో కలిసి కేంద్ర పథకాల కరపత్రాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత మాపై ఉందని ఆయన అన్నారు . బీజేపీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా పాత,కొత్తవారితో కలుపుకొని పోయి ప్రచారాలు ముమ్మరం చేస్తామని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ కలిసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. .నేటి నుంచి ప్రచారాలకు , బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారాలకు రావాలని పిలుపునిచ్చారు.