విజయవంతంగా ముగిసిన నందమూరి నగర్ వార్డు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు

విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి డిసెంబర్ 30-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు క్రీడల పై ఆసక్తి , నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికి తీయుటకు ఆడదాము ఆంధ్ర పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నందమూరి నగర్ వార్డు స్థాయిలో ఆడదాం ఆంధ్రా పోటీల్లో భాగంగా శనివారం వాలీబాల్ మరియు ఖో ఖో పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ క్రీడా పోటీలలో మహిళా క్రీడాకారులు ఏంతో ఉత్సాహంతో పాల్గొన్నారు .
శనివారం జరిగిన ఖో ఖో పోటీల యందు టీం2 వారు 9 పాయింట్లు , టీమ్ 1 వారు 2 పాయింట్లు సాధించడం జరిగింది , టీమ్2 వారు గెలుపొందారు .
ఈ కార్యక్రమం నందు వార్డు కౌన్సిలర్ వార్డు ఇన్చార్జి శ్రీ యూసఫ్ , వార్డు సెక్రటరీలు, క్రీడాకారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా ఈ క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క అధికారి కి , వ్యాయామ ఉపాధ్యాయులకు , వార్డు కౌన్సిలర్ , వార్డు ఇన్చార్జిగారికి, వార్డు ప్రజలకు క్రీడాకారులకు అందరికీ సచివాలయ సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలిపారు .