విభారె న్యూస్ డిసెంబర్ 29 కర్నూలు (జిల్లా ప్రతినిధి).
కర్నూల్ జిల్లా నందు పోలీస్ శాఖ సమర్థ వంతంగా పని చేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయనిపోలీస్ లు కలిసి కట్టుగా పని చేయడం వలనే సాధ్యమైoదని జిల్లా ఎస్పి జి. కృష్ణకాంత్ ఐపిఎస్ మీడియా కు తెలియచేశారు.పోలీసింగులో విన్నూత్న మైన మార్పులను తీసుకురావడం వల్లనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీ కృత ఉత్సాహంతో 2024 లో మరింత మెరుగైన పోలీసింగ్ తో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందిస్తాము.గత సంవత్సర౦ తో పోల్చుకుంటే 2023లో అన్ని రకాలైననేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించింది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయి లో నేరాలను నియంత్రించడంలో పోలీసులు సఫలీకృతం అయ్యారు.
నేర గణాంకాలు…
గణనీయంగా నేరాల తరుగుదల..
విజబుల్ పోలీసింగ్,అసాంఘిక శక్తుల పైన నిఘా,అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంత నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా ఫై ఉక్కుపాదం మోపడం, కన్విక్షన్స్ పైన ఫోకస్ చేయడం, గంజాయి పైన కట్టడి వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పి తెలియజేసారు.2022 లో నమోదైన కేసులు 6985 నమోదు కాగా, 2023లో 5829కేసులు నమోదైనట్లు వారు తెలియ జేశారు.
హత్యలు, హత్యాయత్నం, కోట్లట కేసులు :2022 లో 39 హత్య కేసులు,2023 లో 33 హత్య కేసులునమోదు కాగా 2022 లో 86 హత్యయత్నం కేసులు, 2023లో 45 హత్యాయత్నం కేసులు నమోదు కాగా అదే విధంగా 2022 లో 28 దొమ్మి కేసులు,2023 లో 12 దొమ్మీ కేసులు నమోదు అయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటేతగ్గుముఖంపట్టాయి.ఆస్తికి సంభందించిన నేరాలు:
బీట్స్ ను రీ- ఆర్గనైజ్ చేయడం,నిరంతర పర్యవేక్షణ,టెక్నాలజీ వినియోగం,నిందితుల పైన దర్యాప్తు,జైలు నుండి విడుదల అయిన నేరస్తులపై నిఘా,పొరుగు జిల్లాలు, రాష్ట్రాలతో సమన్వయంతో, అనుమానితుల వెళ్లి ముద్రల పోల్చడం ద్వారా దొంగతనాలు తగ్గడం జరిగింది. 2023 లో నేరస్తులను గుర్తించడంతో పాటు రికవరీ శాతం కూడా బాగా పెరిగింది.
దోపిడీలు:-
2022లో 5 కేసులు, 2023లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.గత సంవత్సరo తో పోల్చుకుంటేపూర్తిగా తగ్గుముఖంపట్టాయి.
బందిపోటు :-
2022లో 14 కేసులు, 2023లో 2 కేసులు నమోదు అయినవి.గత సంవత్సరo తో పోల్చుకుంటేపూర్తిగా తగ్గుముఖంపట్టాయి.
దొంగతనాలు:-
2022లో 303 కేసులునమోదు కాగా, 2023లో 224 కేసులు నమోదు అయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటే26% తగ్గుముఖంపట్టాయి.
పగటి దొంగతనాలు:-
2022లో 49 కేసులునమోదు కాగా, 2023లో 26 కేసులు నమోదు అయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటే47% తగ్గుముఖంపట్టాయి.
రాత్రి దొంగతనాలు:-
2022లో 130 కేసులునమోదు కాగా, 2023లో 112 కేసులు నమోదు అయినాయి. గత సంవత్సరo తో పోల్చుకుంటే14% తగ్గుముఖంపట్టాయి.
రోడ్డు ప్రమాదాలు:
2022 లో 601 రోడ్డు ప్రమాదాలు,2023 లో 456 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ ల ఐడెంటిఫికేషన్, రెక్టిఫికేషన్,ప్రమాద సమయాలను గుర్తించి ఆ సమయాల్లో పోలీసు నిఘా,ఎన్ఫోర్స్మెంట్ పెంచడం, ఏ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి తగు చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు శాతంగణనీయంగా తగ్గడం జరిగింది.
మహిళలపై తీవ్ర నేరాలు:
విజబుల్ పోలీసింగ్, దిశ కార్యక్రమాల పటిష్ట అమలు, నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ తదితర చర్యల ద్వారా మహిళపై జరిగే తీవ్ర నేరాలు తగ్గుముఖం పట్టగా, కుటుంబ హింస కు సంభందించిన నేరాలను సైతం నియంత్రించడం జరిగింది.2022 లో 6 వరకట్న మరణాల కేసులు, 2023లో 1 వరకట్న మరణాల కేసు నమోదుఅయినది.
గత సంవత్సరo తో పోల్చుకుంటే 83% తగ్గుముఖంపట్టాయి. 2022 లో 28 అత్యాచార కేసులు,2023లో 28కేసులు నమోదుఅయినవి.ఇవి స్థిరంగా వున్నవి. 2022 లో 19 పోక్సో గ్రేవ్ కేసులు, 2023లో 17 పొక్సో గ్రేవ్ కేసులు నమోదుఅయినవి. గత సంవత్సరo తో పోల్చుకుంటే11% తగ్గుముఖంపట్టాయి. 2022 లో 25 పోక్సో నాన్ గ్రేవ్ కేసులు,2023లో 19 పోక్సో నాన్ గ్రేవ్ కేసులు నమోదుఅయినవి. గత సంవత్సరo తో పోల్చుకుంటే24% తగ్గుముఖంపట్టాయి.
ఎస్ సి/ఎస్ టి లపై నేరాలు:
గ్రామ సందర్శనలు, నేర ప్రభావిత ప్రదేశాలను గుర్తించి నిఘా ఉంచడం, జిల్లా రివ్యూ మీటింగులు, నేరస్తుల పట్ల కఠినమైన చర్యలు చేపట్టడం ద్వారా ఎస్ సి/ ఎస్ టి లపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి.2022లో 151కేసులు,2023లో 150 ఎస్ సి/ఎస్ టి కేసులు నమోదు. గత సంవత్సరo తో పోల్చుకుంటే1% తగ్గుముఖం.
సైబర్ నేరాలు :-
2022లో 56 కేసులు, 2023లో 39 కేసులు నమోదుఅయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటే30 % తగ్గుముఖం.
లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం:
జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 2023 లో నాలుగు విడతలు గా జరిగిన లోక్ అదాలత్ లో పోలీస్ శాఖకు సంభందించి మొత్తం 3935 కేసులను పరిష్కరించడం జరిగింది. అందులో 2550 కంపౌండబుల్ ఐ పి సి కేసులు (భూమి,ఆస్తి, హక్కులపై వివాదాలు,చిన్న నష్టాలు, గాయాలు, చిన్న దొంగతనాలు, దోపిడీలు, సాదారణ స్థాయిలో హింస).వంటి కేసులు కాగా ఎస్ఎల్ఎల్, ఎక్సైజ్ కేసులు 251,ఐపిొసి కాని ఇతర కేసులు, పెట్టి కేసులు 1134 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది.
మొబైల్ రీకవరీ మేళా…
బాధితులు పొగొట్టుకున్న సెల్ ఫోన్ల ను రికవరీ చేసి మొబైల్ రికవరీ మేళాలో అందజేశారు.బాధితులలో ఇతర రాష్ట్రాలు,జిల్లాల వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 6719 మొబైల్స్ రికవరీ చేశాం.(వాటి విలువ సుమారు14.61 కోట్లు) మొబైల్ ఫోన్ పోతే http://Kurnoolpolice.in/mobiletheft లింకు ను క్లిక్ చేసి మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తాం
సిసికెమెరాలు.:
గ్రామాలు, పట్టణాలలో నేర నివారణకు సమస్యాత్మక, ఫ్యాక్షన్ ప్రభావితమైన 112ప్రదేశాలను గుర్తించి 428సిసి కెమెరాలను ఏర్పాటు చేశాం.
ఇన్ఫోర్స్మెంట్ వర్క్:
ఏపీ ప్రోహిబిషన్ ఐడి కేసెస్:-
2022 లో 339 కేసులు, 2023 లో 292 కేసులు నమోదు అయినవి.
AP Excise (NDPL) Cases:-
2022 లో 540 కేసులు, 2023 లో 634 కేసులు నమోదు అయినవి.
ఎన్ డి పి ఎస్ కేసెస్ :-
2022 లో 11 కేసులు, 2023 లో 13 కేసులు నమోదు అయినవి.అదే విదంగా మట్కా, క్రికెట్ బెట్టింగ్, గాంబ్లింగ్ లలో 592 కేసులలో 1833 మందిని అరెస్ట్ చేయడం జరిగినది, రు. 1,51,97,000/- సీజ్ చేయడమైనది.