
కోసిగి, అక్టోబర్ 02 (విభారె న్యూస్) రైతు నేత నిత్యం రైతులకు పంటలు సాగు దిగుబడులు పై సలహాలు సూచనలు ఇస్తూ తనదైన శైలిలో ప్రజాధరణ పొందిన వ్యక్తి అరికెరి వీర రాజు ఆయన మరణం రైతులకు ఓచేదు జ్ఞాపకం.అరికెరి వీరారాజు (76) సంవత్సరాలు, సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో తమ స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.ఆయన మరణం తో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ నివాళులర్పించారు.వీర రాజు దొర అంటే ఒక ఆత్మీయ పలకరింపు అంతకుమించి ఒక పెద్ద దిక్కు , అరికెరి వీర రాజు దొర వ్యవసాయ రంగంలో దిట్ట, ప్రస్తుతం ఉల్లిగడ్డల వ్యాపార వేత్త, ఈయనకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు కలరు.