ఆళ్లగడ్డ ప్రతినిధి జూన్ 23 విభారె న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి శంసుల్ హక్, ఆళ్లగడ్డ మండల అధ్యక్షుడు బరగొడ్ల హుస్సేన్ భాషాలు అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తాము చేసిన సేవలను గుర్తించి ఆళ్లగడ్డ అసెంబ్లీ కోఆర్డినేటర్లగా నియమించడం పట్ల వారు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తాము ప్రారంభంలో కార్యకర్త స్థాయి నుండి పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తున్న తమకు పార్టీలో ఒక కేడర్ మరియు మంచి గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కష్టపడే మనస్తత్వం, పార్టీ పట్ల అంకితభావం ఉండేవారికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పిసిసి ప్రెసిడెంట్ ప్రకటించడం పట్ల మా బాధ్యతలు మరింత పెరిగాయని వారు పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అందుకోసం తమ వంతు కృషి చేస్తామని వారు వివరించారు. అలాగే రాష్ట్రంలో, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకి, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలికి, నంద్యాల డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ కు, పార్టీ నాయకులకు, పెద్దలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.