ఆళ్ళగడ్డ ప్రతినిధి జూన్24 విభారె న్యూస్:-ఆళ్లగడ్డ పట్టణంలో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని టౌన్ సి.ఐ రమేష్ బాబు సూచించారు. శనివారం సాయంత్రం ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా హిందూ,ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ బక్రీద్ తొలి ఏకాదశి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలందరు పోలీస్ శాఖతో సహకరించాలని సిఐ రమేష్ బాబు పేర్కొన్నారు.ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టి.వినోద్ కుమార్, అమీర్ భాష,పారిశ్రామికవేత్త టిఎంసి వేణుగోపాల్, ముస్లిం మతపెద్దలు,పుర ప్రముఖులు పాల్గొన్నారు.