పర్యావరణ పరిరక్షణ అనే అంశం పై విద్యార్థులకు అవ గాహన.
మార్చ్ ఫర్ సైన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆజాది కా అమృత మహోత్సవ్ .
బుక్కపట్నం ::విభారె న్యూస్::జూన్ 23 :- సత్యసాయి జిల్లా పరిధిలోని కే జి బి సి బుక్కపట్నం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రూరల్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు బండ్లపల్లి మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు
అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ సమతుల్యం ఇతర అంశాల పట్ల అవగాహన కల్పించుకోవాలని సూచించారు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మార్పులు కనుగుణంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అదేవిధంగా రాయలసీమ జిల్లాలు ఎడారి కాబోతున్నాయని శాస్త్రవేత్తలు ముందుగానే తెలియజేస్తున్నారు రాజస్థాన్ తరహాలోనే ఈ రాయలసీమ జిల్లాలు ఎడారులు కాకుండా పర్యావరణం కాపాడడం కోసం మొక్కలు నాటడం నీటిని నిలువ చేయడం పశు పక్ష్యాదులను సంరక్షించుకున్నప్పుడే కరువు నుండి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నారు. కొండల్లో గుట్టల్లో చెట్లు నాటే కార్యక్రమ కొనసాగించాలని కోరారు. రాబోవు తరాలకు మనం ఇప్పటి నుంచే వీటిని పెంపొందిస్తే ఎడారి కాకుండా కాపాడుకోవచ్చు అన్నారు . అందుకు విద్యార్థులు సైతం తమ గ్రామాలలో వీటి పైన తల్లిదండ్రులకు అవగాహన కల్పించి జీవకోటి ప్రాణాలకు ప్రాణవాయువులైన పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేయాలని కోరారు అందుకు తన వంతుగా పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలలో సమయం ఉన్నప్పుడు పైన తెలిపిన విధంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. తన వలన ఉమ్మడి అనంతపురం జిల్లాకు బి ఈ ఎల్ ఆర్ &డి సెంటర్ , సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ , సైనిక్ స్కూల్, ఐఐటి, తిరుపతి ఐఐఎస్ఇఆర్ తీసుకురావడం జరిగిందని దీని ద్వారా ఎంతో మంది విద్యార్థుల అవకాశాలు పొందారని బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి తెలిపారు . భవిష్యత్ తరాలకు మంచి చేయాలన్న సంకల్పంతోనే వీటి పైన అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు అవసరమైన కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తలమల్ల సంజీవరెడ్డి , ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి నాగమణి, ఉపాధ్యాయులు విద్యార్థులు,ఆర్ ఏ డి ఎస్ అధ్యక్షులు బండ్లపల్లి మదనమోహన్ రెడ్డి పాల్గొన్నారు.