ఆళ్ళగడ్డ ప్రతినిధి జూన్ 23 విభారె న్యూస్
:- రుద్రవరం మండలంలోని నర్సాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొన సాగుతున్నాయి.ఈ సందర్భంగా కార్యదర్శి కొండయ్య మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ కాలువలలో పూడికతీత, ఈగలు దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ ను స్ప్రే జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో ఓబయ్య,ANM లు పాల్గొన్నారు.