ఘనంగా అహోబిల మఠం పీఠాధిపతి తిరు నక్షత్ర వేడుకలు

ఆళ్లగడ్డ ప్రతినిధి విభారె న్యూస్ జూన్ 23 :- అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీవన్ శ్రీ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి 68 వ తిరునక్షత్ర వేడుకలు చెన్నైలోని అహోబిల మఠంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అహోబిల మఠం నుండి చెన్నైలోని అహోబిల మఠానికి ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల ఆచార్యులు, మలియార్ సౌమ్యనారాయణ, అర్చక బృందం మధుసూదనాచార్యులు తదితరులు ఆనవాయితీ ప్రకారం ప్రత్యేకంగా మర్యాదలు తీసుకొని వెళ్లి అక్కడ పీఠాధిపతి కి సమర్పించారు.