తహసిల్దార్ ను సన్మానించిన వైసీపీ నాయకుడు నాగ ముని

ఆళ్ళగడ్డ తాలుకా రుద్రవరం జూన్ 16విభారె న్యూస్:- రుద్రవరం మండలం తహసిల్దార్ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర ప్రసాద్ ను హరినగరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సవరం నాగ ముని శుక్రవారం సన్మానించారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన తాసిల్దార్ రవీంద్ర ప్రసాద్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల మాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.