ఎమ్మిగనూరు :: జూన్ 16 ::విభారె న్యూస్.
స్థానిక శ్రీ సుంకులమ్మ అవ్వ దేవాలయంలో శుక్రవారం ను పురస్కరించుకొని ఉదయాన్నే శ్రీ సుంకులమ్మ అవ్వ కు అభిషేకం, అర్చన, అలంకరణ చేసి నిమ్మకాయల మాల తో అలంకరణ చేశారు అనంతరం మహా మంగళహారతి నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. పై పూజా కార్యక్రమాలన్నీ ఆలయ పూజారి నాగరాజు దంపతులు నిర్వహించారు.