పెద్ద కడుబూరు జూన్ 16 విభారె న్యూస్.
స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు సిఆర్పిఎఫ్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఈ లింగన్న వలస వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సిఆర్పిఎఫ్ కర్నూలు జిల్లా కన్వీనర్ డాక్టర్ ఈ లింగన్న స్వయంగా వెళ్లి పెద్ద కడుబూరు బీసీ హాస్టల్లో చేర్పించారు.ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ బడి బయట పిల్లలు బడిలో ఉండాలని పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అందులో భాగంగా మీ పిల్లలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కన్వీనర్ అన్నారు. ఈ సందర్భంగా బోడబండ గ్రామానికి చెందిన కురువ సోమేశ్ అనే విద్యార్థి తండ్రి మాట్లాడుతూ నేను నిత్యం హైదరాబాద్ కు వలస వెళ్లే వాడినని మా పిల్లవాణ్ణి చేర్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా పెద్దకడు బూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి మాట్లాడుతూ మీ పిల్లలు క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు అయినా మీరు కూడా నెల నెలకు వచ్చి మీ పిల్లల్ని బాగోగులు చూసుకొని వెళ్లాలని పాఠశాల హెచ్ఎం రామ్మూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాయి, చరణ్, కార్తీక్, ఆకాష్, రాజశేఖర్, మనోజ్ కుమార్, నంద, మోహన్ కృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.