అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.

చాగలమర్రి:: విభారె న్యూస్ :: చాగలమర్రి గ్రామంలో ఎండ తీవ్రత దృషిలో ఉంచుకొని అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి రోజు పలు చోట్ల యాచకులకు , వృద్ధులకు , అనాథలకు , హమాలిలకు , ఆటో డ్రైవర్లు , వాహనదారులకు , వికలాంగులకు , బస్ డ్రైవర్లకు , కార్ డ్రైవర్లకు దాదాపుగా ఇలా ఒక్కోరోజు ఒక్కో చోట ప్రతి రోజు 100 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు తెలిపారు. దాతలు ఎవరైనా ప్రతి రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించాలని తెలిపారు.ఈ సంస్థలో నాసిర్ పఠాన్ , ఆటో వాసు , యువతేజ , బాలకృష్ణ వీరందరూ తోడుగా నిలిచి ప్రతి రోజూ కార్యక్రమం జరపాలని అనుకున్నారు.ఎవరైనా దాతలు ఉంటే వివరాలు సంప్రదించవల్సిందిగా కోరారు సెల్ నంబర్ 9948340319 , 8639004420.