నంద్యాల మా ప్రతినిధి ఏప్రిల్ 21 విభారె న్యూస్ :-
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న12 మంది పోలీసు సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీ గారికి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ గారు సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు.
సిబ్బంది యొక్క ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ,స్పెషల్ బ్రాంచ్ సీఐ దస్తగిరిబాబు ఎస్పీ సీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు