ఆళ్లగడ్డలో సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు

ఆళ్లగడ్డ::(విభారె న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి ఆవరణంలో స్వామి వివేకానంద విశ్వమానవ సేవాసమితి ఆధ్వర్యంలో సామూహిక చిన్నారుల భోగి పండుగ మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ వేడుకలో చిన్నారుల తలపై భారతీయ హిందూ సాంప్రదాయ రీతిలో భోగి పండ్లు పోసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. విశ్వ మానవ సేవా సమితి అధ్యక్షులు శివ ప్రసాద్ మరియు సాయి, భోగి పళ్ళ ప్రాశస్త్యం గురించి వివరించారు.భోగి పళ్ళు తలపై పోయడం వలన చిన్నారుల ఆయురారోగ్యాల అభివృద్ధికి తోడ్పడుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి చిన్నారులు, వారి తల్లిదండ్రులు మరియు ముఖ్యఅతిథిగా శ్రీమతి ఆవుల లతా భాస్కర్ రెడ్డి , స్వామి వివేకానంద విశ్వ సేవా సమితి బృందం పాల్గొనడం జరిగింది. ఇలాంటి సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివప్రసాద్ ను ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా అభినందించారు.