ఆ జిల్లాలో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు

విభారె న్యూస్ :: దేశంలో కరోనా ప్రభావం రికార్డులు బద్దలు కొడుతూ ఉంది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక కరోనా సోకిన దేశాల జాబితాలో రెండవ స్థానానికి చేర్చింది.ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,తమిళనాడు, మహారాష్ట్ర, యూపీలలో కరోనా మహమ్మారి సోకినవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క పుణె జిల్లాలోనే ఇప్పటివరకు 2లక్షలకుపైగా కరోనా కేసులు నమోదైనట్టు మహారాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2లక్షల పాజిటివ్‌ కేసులు దాటిన తొలి జిల్లాగా పూణే రికార్డు సాధించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న పై ఐదు రాష్ట్రాలను మినహాయిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన కేసుల మొత్తాల కన్నా ఇక్కడ నమోదైన కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం.