అహోబిల పుణ్యక్షేత్రం లో దర్శనాలు పునఃప్రారంభం::

ఈ.ఓ. మల్లికార్జున ప్రసాద్ఆళ్లగడ్డ::( విభారె న్యూస్):: కరోనా కారణంగా మూతబడిన అహోబిల దేవస్థానాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నుంచి దర్శనానికి అనుమతిస్తున్నట్లు అహోబిల దేవస్థానం ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. దేవస్థాన అర్చకులకు కూడా కరోనా సోకడంతో 2 నెలల క్రితం ఆలయంలో దర్శనాలు నిలిపివేసి, ఈరోజు పునః ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోవు స్వాతి సందర్భంగా జరగబోయే హోమానికి కేవలం 20 మంది భక్తులకు మాత్రమే మాత్రమే అనుమతి ఉన్నట్లు, ఈ సందర్భంగా భక్తులందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.