రామలింగేశ్వర స్వామిని తాకిన సూర్యకిరణాలు

 ఏలూరు :: (విభారె న్యూస్):: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకడంతో అర్చకులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారిని తాకిన సూర్యకిరణాలు విభూతి అలంకరించిన ట్లు అనిపించాయి అని సూర్యకిరణాలు స్వామి వారిని తాకడం వలన సమస్త రోగాలు నివృత్తి అవుతాయని  వివరించారు. గత ఐదు సంవత్సరాల నుండి ఈ మాసంలో సూర్యకిరణాలు పడట చూడలేదని, ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో మాత్రమే సూర్యకిరణాలు పడతాయని అర్చకులు తెలిపారు.