జిమ్ కు వచ్చిన యువతి పై వేధింపులు

 ఏలూరు :: (విభారె  న్యూస్) :: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జింక్ వచ్చిన యువతుల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడిన యజమానిపై ఒక యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫోన్ లో ఫోటోలు చిత్రీకరించి అతని స్నేహితుల సెల్ ఫోన్ లకు పంపేవాడు. దీనిపై అతన్ని ప్రశ్నించడంతో ఆ యువతిని ఆమె తండ్రిని చంపుతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి ఏలూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా జిమ్ యజమాని నరేష్ తో పాటు అతని సోదరుడు,  తండ్రి, స్నేహితురాలిపై కేసు నమోదు చేసి నరేష్, అతని సోదరుడు అనుదీప్ లను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.