మద్యపాన ప్రియులకు శుభవార్త :: ఇతర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్లకు అనుమతి

ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు  తీసుకురావచ్చు :: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించే లక్ష్యంతో అనేక చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను భారీగా పెంచడంతో పాటు ప్రభుత్వమే వైన్ షాపులను నడుపుతోంది.  దుకాణాల సంఖ్యను కూడా పెద్ద మొత్తంలో తగ్గించింది. అంతేకాకుండా, రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం లేకపోవడంతో, పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం పెరుగుతోంది. రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. రోజూ భారీ సంఖ్యలో మద్యం సీసాలు పట్టుబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో, జి ఓ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుండి ఒక్కొక్కరికి 3 సీసాల మద్యం దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  
వారి వాదనలు విన్న తరువాత,   ఇతర రాష్ట్రాల నుండి మూడు సీసాల మద్యం తీసుకురావచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. మరియు GO 411 ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. .