చీర మడతల్లో ఒక కోటి 36 లక్షల రూపాయలు

చెన్నై :: ఆగస్టు 28:: చీర మడత లోనుంచి ఏకంగా కోటిన్నర విలువైన నోట్లు బయటపడ్డాయి. భారీ మొత్తంలో నగదును విదేశాలకు అక్రమంగా తరలించే క్రమంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. సింగపూర్ కు కొరియర్ చేసిన మూడు పార్సిల్ లపై అనుమానం వచ్చిన అధికారులు వాటిని తెరిచి చూడగా అందులో కొత్త షర్టులు, పట్టు చీరలు ఉన్నాయి. వాటి మడతల మధ్యలో దాచిన 50000 అమెరికా డాలర్లు, నాలుగువేల యూరోలు, దాదాపు ముప్పై లక్షల రూపాయల నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 36 లక్షలు ఉంటుందని అంచనా. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు విచారిస్తున్నారు.