:: (విభారె న్యూస్):: ప్రాణప్రదంగా పెంచుకున్న కుమార్తె మరణించడంతో ఓ తండ్రి తీవ్ర దుఃఖంలో ఆమెనే తలుచుకుంటూ ఆమె సమాధి వద్దే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.ఈ విషాద సంఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం.. జలాల్పేటకు చెందిన రోల్డ్ గోల్డ్ పనులు చేసుకునే లక్కోజి గిరిబాబు (52) అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. పిల్లలను ప్రేమగా పెంచుకున్న గిరిబాబు కొంతకాలం క్రితం పెద్ద కుమార్తె రేణుకా దేవికి వివాహం చేశాడు. ప్రసవం సమయంలో ఏర్పడిన సమస్యల వల్ల ఆస్పతిలో చేరిన ఆమె అస్వస్థతకు గురై ఇటీవల మృతి చెందింది.
మరణించినకుమార్తెను తలచుకుంటూ గిరిబాబు తరచూ రేణుకాదేవి సమాధి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన గిరిబాబు రాత్రికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం అనుమానం వచ్చిన బంధువులు శ్మశానం వద్ద కుమార్తె సమాధి వద్ద గిరిబాబు మృతదేహం పడి ఉంది. పోలీసులు మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.