పనిమనిషి పై దాడి చేసినందుకు భారతీయ జంటకు జైలు శిక్ష

సింగపూర్ లో భారతదేశానికి చెందిన పనిమనిషి పై దాడి చేసినందుకు,  దోషులుగా నిర్ధారించిన కోర్టు ఇక్కడి భారతీయ జంటకు జైలు శిక్ష మరియు 15,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించినట్లు తెలిసింది.నవంబర్ 2016 లో ఆమెను పనిలో నియమించిన మొదటి రోజు నుండే అమన్‌దీప్ కౌర్‌ను దుర్భాషలాడి నందుకు, అనేకసార్లు  దాడి  చేసినందుకు సింగపూర్ కోర్టు ఫరా తహసీన్‌కు 21 నెలల జైలు శిక్ష, ఆమె భర్త మొహమ్మద్ తస్లీమ్‌కు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.