అన్నదమ్ముల దారుణ హత్య :: కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకున్న కన్నతల్లి

నల్లగొండ :: పాత కక్షల కారణంగా ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకొడవళ్లలతో గాయపరిచి దారుణంగా హతమార్చారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హజారిగూడేనికి చెందిన ముగ్గురు సోదరులు సత్యనారాయణ, హరి, ఆంజనేయులు వివిధ వృత్తుల్లో అక్కడే స్థిరపడ్డారు. హరి భార్యతో హాలియాకు చెందిన రేవంత్‌ అనే వ్యక్తి వివాహేతర కలిగి ఉన్న నేపథ్యంలో రేవంత్‌ను హరి మందలించాడు. హరి తల్లిదండ్రులకు సైతం ఫిర్యాదు చేశాడు. పోయిన సంవత్సరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు.  పోలీసుల కౌన్సెలింగ్‌ తర్వాత కూడా రేవంత్ లో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన హరి ఫిబ్రవరి నెలలో కిరాయి హంతకులతో రేవంత్‌ను హత్య చేయించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న హరి, ఆంజనేయులతో  ఇటీవలే బెయిల్‌పై విడుదలై సొంతూరుకు చేరుకున్నారు.అవకాశం కోసం వేచి ఉన్న రేవంత్ తల్లి ఇందిర పక్కా ప్రణాళికతో   సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సత్యనారాయణ హజారిగూడెంలోని తన ఇంటిముందు నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో అతడిపై దాడి చేశారు. సత్యనారాయణ అరుపులు విన్న బయటకు వచ్చిన అతని తమ్ముడు ఆంజనేయులు పై కూడా దుండగులు దాడి చేశారు . అన్నదమ్ములిద్దరు  అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రాథమిక విచారణలోరేవంత్‌ హత్యకు ఇది ప్రతీకార ఘటనగా తేలిందని ఎస్సై శివకుమార్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.