ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం :: లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు లక్ష దాటాయి.  కొత్తగా 6,051 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,349 కి చేరుకుంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1210కేసులు, గుంటూరు జిల్లాలో 744 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 51,701 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.49,558 మంది కరోనా నుంచి విముక్తులు అయ్యారు. తాజాగా 49 మంది మరణించారు

పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కృష్ణ జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బారిన పడి మరణించారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,090కి చేరింది. నిన్న ఒక్క రోజులో 43,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 16,86,446 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.