ప్రభుత్వ ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు

ఢిల్లీ :: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి,  సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఢిల్లీ ప్రభుత్వము షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వము కోవిడ్ రోగ నిరోధకానికి రూపొందించిన విధానాలను సోషల్ మీడియా ద్వారా విమర్శించినందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ సంఘం (జిఎస్టిఎ) ప్రధాన కార్యదర్శికి ఢిల్లీ ప్రభుత్వ విద్యా విభాగం షో కాజ్  నోటీసు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ప్రభుత్వ విధానాలను విమర్శించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ  సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోస్ట్ చేసినందుకు ఈ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.