ముంబైలో కూత పెట్టనున్న లోకల్ రైలు

ముంబై : కరోనా మహమ్మారి ప్రభావంతో  అతలాకుతలమైన ముంబై నగరంలో దాదాపు మూడు నెలలుగా మూతబడిన ముంబై స్థానిక రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి కొంత మందిని మాత్రమే అనుమతిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సేవల సిబ్బంది, వైద్య రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైలులో భౌతిక దూరం తప్పనిసరి చేశారు. ఒక్కో లోకల్ రైలులో కేవలం 700 మందిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.