మనకున్న మహిళా యాత్రికులే తక్కువ. వారిలో నిరంతర యాత్రికురాలు నర్మదారెడ్డి. నర్మదకు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లడం, ప్రకతి సౌందర్యాన్ని తిలకించడం, భిన్న సంస్క తుల ప్రజల జీవనశైలిని ఆకళింపు చేసుకోవడం ఇష్టమైన అభిరుచులు. అనుభవం ఉన్న పర్యాటకులే వెళ్లేందుకు సాహసించని ధ్రువ ప్రాంతాలైన అంటార్కిటికా, ఐస్లాండ్, నార్వేలలో కూడా ఆమె విహరించి వచ్చారు. అజర్బైజాన్, జార్జియా, సైబీరియా, మంగోలియాలతో పాటు చైనా, దక్షిణ కొరియా, మలేషియా, బ్రూనై, బల్గేరియా, రుమేనియా, గ్రీస్, ఇటలీ, క్రొయేషియాలను సందర్శించి అక్కడి విశేషాలను, వసతులను, ఆహారపు అలవాట్ల మూలాలను అధ్యయనం చేశారు. ఆ యాత్ర విశేషాలను తెలుపుతూ ‘ఆగదు మా ప్రయాణం’, ‘కొలంబస్ అడుగు జాడల్లో మా ప్రయాణం’ అనే పుస్తకాలు రాశారు. నర్మద గహిణిగా ఉంటూనే న్యాయవాద విద్యను అభ్యసించారు. నూటయాభై దేశాలను చుట్టి వచ్చారు. ఇటీవల కొలంబస్ ‘అడుగు జాడల్లో’ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో ముచ్చటించారు. ఆ విశేషాలు.
మార్క్ ట్వైన్.. కొలంబస్
నర్మద వివాహం అయినప్పటి నుంచి భర్త నోముల ఇంద్రారెడ్డితో కలిసి ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ‘రిసార్ట్ కండోమినియమ్స్ ఇంటర్నేషనల్’ సంస్థ సభ్యులుగా చేరటంతో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఆమె కల సులువుగా సాకారమైంది. ఇంచుమించు కొలంబస్ నడయాడిన ప్రాంతాలన్నీ ఆమె తిరిగొచ్చారు. చైనాను ‘భూతల స్వర్గం’ అంటారు నర్మద. అక్కడి ప్రజల క్రమశిక్షణ, కట్టుబాట్లు, ట్రైన్లు, శుభ్రమైన రోడ్లు ఏ టూరిస్టును అయినా ఇట్టే ఆకర్షిస్తాయట. గొప్ప అనుభూతిని ఇచ్చింది మాత్రం నైబీరియన్ ట్క్రెన్ జర్నీ అట. సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి చైనా, రష్యా, మంగోలియా మధ్య ఆరు రోజులు చేసిన ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేనని నర్మద అంటారు. ‘అన్వేషించు, కల గను, సాధించు’ అనే మార్క్ ట్వైన్ సందేశం నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. జీవితాన్ని కేరింతలు, తుళ్లింతలతో నవ్వుతూ ఆనందిస్తూ, నలుగురికి చేయూతనిస్తూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆమె కోరిక. పర్యటనలు, విహారాలతో పాటు జీవిత చరమాంకం వరకు విద్యార్థినిగానే ఉండిపోవాలని ఆమె ఆశ. అందుకే ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేశారు. ఇప్పుడు పీహెచ్డీపై ద ష్టి పెట్టారు. నర్మద ట్రావెలర్ మాత్రమే కాదు. మంచి గాయని కూడా. హైదరాబాద్లోని శ్రీత్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమాల్లో తరచూ పాల్గొని పాటలు పాడుతుంటారు. షటిల్ బ్యాట్మింటన్ ప్లేయర్ కూడా. స్టేట్ లెవెల్ పోటీలలో హైదరాబాద్ జట్టు నుంచి విజయం సాధించారు. అంతేకాదు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ భూమిపై ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో కూడా తెలియని కాలంలో కొంతమంది మనుషులు తమ వ్యయప్రయాసలకోర్చి, వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి, లెక్కలేనన్ని అగాథాలను దాటుకుంటూ అక్కడి మనుషుల గురించి, వారి దేశం గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి ప్రపంచానికంతటికీ తెలిపారు. ఆ గొప్ప వ్యక్తుల మూలంగా మనమందరం ఇవాళ ఒకరికి ఒకరం తెలిసిపోయాం. ఒకరితో ఒకరం మాట్లాడుకుంటున్నాం. వారి ఉద్దేశాలు, అవసరాలు ఏమైనప్పటికీ తమ యాత్రల ద్వారా మానవాళికి ఎంతో గొప్ప సేవ చేసిన మార్గదర్శకులు ఫాహియాన్, హుయాన్ త్సాంగ్, మార్కోపోలో, కొలంబస్, వాస్కోడిగామా.. ఇలా ఎంతోమంది. ఆ మహానుభావులు నడయాడిన నేలపై, వారు తిరిగిన మార్గంలో నేను ఎందుకు ప్రయాణించకూడదు అన్న ఒక చిన్న ఆలోచనే నన్ను ఈ దారి గుండా ప్రయాణం చేసేలా చేసింది. మార్కోపోలు ప్రయాణించిన సిల్క్ రూట్ గుండా మంగోలియా, చైనా తదితర దేశాలన్నీ ఇప్పటికే తిరిగొచ్చాను. తరువాత ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉన్న దీవుల్ని, లాటిన్ అమెరికా ఖండానికి మార్గాన్ని కనుగొన్న ‘కొలంబస్’ ప్రయాణించిన మార్గం గుండా ప్రయాణించాలని నిశ్చయించుకున్నాను. ఈ మార్గమంతా నాలుగు దఫాలుగా కొలంబస్ నౌకలో చుట్టి వచ్చాడు. కానీ నేనైతే నా సౌలభ్యం కోసం ఎక్కువ యాత్రను క్రూజ్లో, ఇంకొంత యాత్రను విమానం ద్వారా ప్రయాణించి వాటినన్నింటినీ చూసి వచ్చాను. వెనిస్లో నివసిస్తున్న కొలంబస్ పక్కనే ఉన్న సముద్రం గుండా ప్రయాణించి వాటిని కనుగొన్నాడు. కానీ ఎక్కడో సుదూరాన ఉన్న ఇండియా నుండి అక్కడికి వెళ్ళడమంటేనే ఎంత వ్యయప్రయాసలతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా వీటిలో ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటేనే ఎన్నో వందల, వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కసారి వీటిని గమనిస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ నుండి న్యూయార్క్కు, న్యూయార్క్ నుండి పోర్కోరికాకు, పోర్కోరికా నుండి కొలంబియాకు, పనామా నుండి బొగొట్టాకు, బొగొట్టా నుండి కార్టజీనాకు, కార్టజీనా నుండి న్యూయార్కుకు ప్రయాణం. ఇలా మొత్తంగా 35, 600 కిలోమీటర్లు.. దాదాపు 35 రోజుల పాటు ప్రయాణం. ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది కొలంబస్ కోసమే.. కొలంబస్ ఎలాగైతే నాలుగు దఫాలుగా యాత్రలు చేశాడో.. నేను కూడా మూడు దఫాలుగా ఈ యాత్ర చేశాను. కొలంబస్ తిరిగిన దేశాలు తిరుగుతుంటే ఆయా ప్రాంతాల సంస్క తి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు అబ్బురపరిచాయి. కొలంబస్లా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నో సంవత్సరాలు వెచ్చించి గమ్యం తెలియని ప్రయాణంలా నా యాత్ర కొనసాగలేదు. కానీ ఇంచుమించుగా కొలంబస్ నడయాడిన ప్రాంతాలన్నింటినీ తిరిగొచ్చాను. యూరప్, అమెరికా, న్యూజిలాండ్ పర్యటనలు మా కొడుకు, కోడలుతో.. మలేషియా, ప్యారిస్, జార్జియా వంటివి అల్లుడు, కూతురితో కలిసి పర్యటించాను. నా ప్రతి పర్యటనలో మావారు తోడుగా ఉన్నారు. అలా కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించిన అనుభవాలు, అనుభూతులు నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇన్ని దేశాలు, ప్రాంతాలు తిరుగుతూ కూడా 95 దివ్యదేశాలు(పుణ్యక్షేత్రాలు) చూసి వచ్చాను. దివ్యదేశాలు అంటే విష్ణు సహస్రనామ ధ్యేయంతో 108 ప్రసిద్ధ దేవాలయాలు నిర్మిస్తే వీటిలో నేను 95 ప్రదేశాలు చూసి తరించాను. ఇక కేవలం 13 మాత్రమే మిగిలిపోయాయి.
నేడు మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న నేటి తరుణంలో ముందు ముందు మహిళలు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని సాటి మహిళగా నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను. విదేశాల్లో మహిళలు ఎంతో ధైర్యంగా ఉంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండీ తల్లిదండ్రులు వారిని ఎంతో ధైర్యంగా పెంచుతారు. ముఖ్యంగా ఆడపిల్లలు మరీ ధైర్యంగా ఉంటారు. నేను విదేశాలు తిరిగాను కదా.. ఒక్కో దేశం తిరిగినప్పుడు ఒక్కో స్పందన. నేను ఇటీవల ఖజికిస్తాన్, తురికిస్తాన్.. దేశాలు తిరిగినప్పుడు అక్కడ ఒక లేక్ దగ్గరికి వెళ్లాము. మునుపు అక్కడకు అలెగ్జాండర్ వెళ్లాడట. మరో లేక్కు వెళ్లినప్పుడు మరో చరిత్రకు సంబంధించిన సంఘటన. ఇలా ఎన్నో.. ఈ వారంలో మయన్మార్ వెళ్లాను. ప్రపంచంలో ఉన్న గుహలు ఎన్నింటినో చూశాను. కానీ విచిత్రమైన గుహలు మాత్రం బర్మాలో చూశాను. 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఊరిలో రెండు వేల గుళ్లు ఉన్నాయి. అందులో 600 ప్రసిద్ధమైన గుళ్లు ఉన్నాయి. వాటిని చూశాను. గుహలలో 8,500 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే.. ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ పది రోజులు ఉన్నాను. ఆ ప్రదేశం చాలా అందంగా, పవిత్రంగా, ప్రశాంతంగా ఉంది. ఇలా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది’ అంటూ ముగించింది నర్మదా రెడ్డి.
ఇలా ఇంకా ఇంకా వివిధ దేశాలను చుట్టి రావడానికి ప్రయత్నం చేస్తోంది నర్మదారెడ్డి. మనవలు, మనవరాళ్లు ఉన్న ఈ వయసులో కూడా ఎంతో చలాకీగా, హుషారుగా ఉండే ఈవిడ బాట్మింటన్ క్రీడాకారిణి. 2016లో ‘ఉమెన్ అచీవర్’ అవార్డును అందుకుంది. అలా నర్మదారెడ్డి మరిన్ని దేశాలను చుట్టిరావాలని.. ఆమె ప్రయాణం ఆనందమయం కావాలని ఆశిస్తున్నాం.