ప్రకతి వైపరీత్యాలు సంభవించే సమయాల్లో ప్రజలకు సహకారం: కేటీఆర్
హైదరాబాద్: విపత్కర సమయాల్లో ప్రజలకు సాయమందించేందుకు దేశంలో ప్రప్రథమంగా రుపొందించిన డీఆర్ఎఫ్ ద్విచక్ర వాహనాలు తెలంగాణలో అందుబాటులోకి వచ్చాయి. ప్రకతి వైపరీత్యాలు సంభవించే సమయాల్లో ప్రజలకు సహకారం అందించడానికి రూపొందించిన ఈ బైక్లను మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని డీఆర్ఎఫ్ కార్యాలయ ఆవరణలో ఆరు డీఆర్ఎఫ్ ద్విచక్రవాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సిబ్బందిని కేటీఆర్ కలిసి ప్రజలకు అతి వేగంగా సేవలందించాలని సూచించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వినియోగించే అన్ని పరికరాలు, వరదల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది వాడే వస్తువుల స్టోర్రూంను మంత్రి సందర్శించారు.