నేనూ సింధూ అభిమానినే

పీవీ సింధూకి బీఎండబ్ల్యూ కారు అందజేసిన నాగ్‌

హైదరాబాద్‌: భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన పీవీ సింధూకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌షిప్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకం సాధించి భారత్‌ను గర్వపడేలా చేసిన సింధూ శనివారం ప్రముఖ సినీనటుడు నాగార్జున చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు అందుకున్నారు. చాముండేశ్వరీనాథ్‌ బహూకరించిన ఈ కారు తాళాలను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున పీవీ సింధూకు అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పీవీ సింధూపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు తానో అభిమానిన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నాననీ.. అక్కడే చూశానని చెప్పుకొచ్చారు. చాముండేశ్వరి నాథ్‌ ఇప్పటివరకు 22 కార్లు పలువురికి గిఫ్ట్‌లుగా ఇవ్వగా.. అందులో నాలుగు కార్లు సింధూనే దక్కించుకోవడం విశేషం. అనంతరం సింధూ మాట్లాడుతూ.. నాగార్జున ఎవర్‌ గ్రీన్‌ హీరో అన్నారు. బ్యాడ్మింటన్‌లో మరింతగా రాణించేందుకు కషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.