- రోగులతో కిక్కిరిస్తున్న దవాఖానాలు
- డెంగ్యూ, మలేరియా,పైలేరియా చికున్గున్యాలతో ఆస్పత్రులు
- ఇప్పటివరకు 33 డెంగ్యూ కేసులు 10 మలేరియా కేసులు నమోదు
- అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
- గ్రామాల్లో కాంపులతో నెట్టుకొస్తున్న వైనం
- సరిపడ కిట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రోగులు
- ఇదే అదనుగా ప్రయివేట్ ఆసుపత్రుల లూటీ

మెదక్ ప్రతినిధి – జ్యోతి న్యూస్
ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులతో అప్రకటిత హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి,చికున్గున్యా,డెంగ్యూ,మలేరియా పైలేరియా,తదితర వ్యాధులు స్వైరవిహారం చేస్తున్నాయి ప్రతీ ఇంట్లో ఒక్కరైనా పేషేంట్లుగా మారుతున్నారు,వారి నుండి మరొకరికి వ్యాధులు సంక్రమించి రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు,దీంతో సామాన్యప్రజలు విషజ్వరాలపై బెంబేలెత్తుతున్నారు.అధికారిక లెక్కల ప్రకారం జనవరి నుండి నేటి వరకు 33 డెంగ్యూ కేసులు,10 మలేరియా,ఒక చికున్గున్యా,ఒక మెదడువ్యాపు,1878 ఫైలేరియా కేసులు నమోదయ్యాయి.దీంతో పాటు సిద్ధిపేట జిల్లాలో ఈనెల 5 తేదీ వరకు 3,485 విషజ్వరాల కేసులు నమోదవగా దీంట్లో 114 డెంగ్యూ,ఒకటి మలేరియా కేసుగా నమోదయినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న రోగుల సంఖ్య
జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లా ఆస్పత్రి, 2 ఏరియా ఆస్పత్రులతో,పాటు 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి,వర్షాకాలం కావడంతో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు,రోజుకి సరాసరి 50 నుండి 100 వరకు ఇన్ పేషేంట్లు వస్తున్నారు,జిల్లా ఆస్పత్రి మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.జిల్లాలోని కొల్చారం కౌడిపల్లి,పాపన్నపేట,రామాయంపేట తదితర మండలాల్లో డెంగ్యూ పైలేరియా ఇతర విషజ్వరాలు ప్రబలడంతో సంబంధిత అధికార యంత్రాంగం కాంపులను ఏర్పాటు చేసింది,ఐనా ఇప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదు,ఆలస్యంగా స్పందించిన సంబంధిత అధికార యంత్రాంగం పట్ల రోగుల కుటుంబాలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం,సిబ్బంది తక్కువగా ఉండడంతో చికిత్స ఆలస్యం అవుతోందని పలువురు స్పష్టం చేస్తున్నారు.
గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం
జిల్లాలోని అనేక గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది,శానిటేషన్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది,ఎక్కడ చూసినా మురికినీరు,మోరీలు,శుభ్రం చేయని నీటి టాంకులు,నీరు నిల్వచేరి దోమలు పందులు స్వైరవిహారం చేస్తున్నాయి,మురుగు నీరు,డ్రైనేజీ నీరు పారుతున్నా జిల్లా అధికార యంత్రాగం వాటిపై పెద్దగా ద ష్టి పెట్టిన దాఖలాలు లేవు,తీరా పరిస్థితి విషమించడంతో చర్యలకు పూనుకోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంది.ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల అభివ ద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.పరిసరాలు ఇంత అద్వాన్నంగా ఉన్నా ఒక్కసారి కూడా వాటి గురించి ఆరాతీయలేదని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు.
ముందస్తు చర్యలు ఎక్కడ..?
ఒక్కసారిగా పరిస్తితులు దిగజారడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి,ప్రభుత్వ అసమర్ధ నిర్ణయాలు సామాన్యులకి శాపంగా మారాయి.చూస్తుంటే ఇదంతా సమస్యలా అనిపిస్తున్నా ఒక సమస్యకు ఇంకో సమస్య చైన్ లింకులా అనిపిస్తోంది.విద్యా వైద్యంపై ప్రత్యేక దష్టి సారించాల్సిన ప్రభుత్వం ఏమారుపాటుగా ఉండడం కూడా అనేక విమర్శలకు తావిస్తోంది. పల్లెసీమలే ప్రగతికి మెట్లు అన్న సూత్రాన్ని మరిచిపోయినట్టుగా ఉందని పలువురు ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.గ్రామాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆశాజనకంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.మొన్నటి వరకు సర్పంచ్ లకు చెక్ పవర్ లేదు చాలా రోజులపాటు చెక్ పవర్ లేకపోవడంతో సర్పంచ్ లు గ్రామలపై పెద్దగా శ్రద్ద చూపించలేకపోరనేది ప్రధాన విమర్శ,ఏటా రావాల్సిన శానిటేషన్ నిధులు రాకపోవడం, దాదాపు నాలుగేళ్లుగా నిధుల లేమి గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది.వీటికి సరిపడ నిధులు లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివ ద్ధి ప్రశ్నార్థకంగా మారింది.
ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ
పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వీటిని క్యాష్ చేసుకునేందుకు ప్రయివేటు ఆస్పత్రులు పోటీ పడుతున్నాయి.వివిధ పరీక్షల పేరుతో పేద ప్రజల దగ్గర నుండి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
ప్రత్యేక కాంపులు ఏర్పాటు చేస్తున్నాం..
జిల్లాలో ప్రస్తుతం విషజ్వరాలు తీవ్రంగా ఉన్నాయి,వీటిని అధిగమించేందుకు వైద్యఆరోగ్య శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసాం,ఇటీవల అనేక గ్రామాల్లో కాంపులు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
-డాక్టర్ వెంకటేశ్వర్ రావు , జిల్లా వైద్యాధికారి