కేంద్రంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు
కోల్కతా : మిషన్ చంద్రయాన్ -2 పై సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఆర్థిక మాంద్యం నుంచి ప్రజల దష్టి మరల్చడానికే కేంద్రం ఈ మిషన్ను వాడుకుంటోందని ఏకిపారేశారు. బెంగాల్ అసెంబ్లీలో ఎన్నార్సీపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ… ”కేంద్రం మొదటి సారి దేశంలో ఈ మిషన్నే చేపట్టింది. ఇంతకు పూర్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఆర్థిక మాంద్యం నుంచి ప్రజల దష్టి మరల్చడానికే ప్రభుత్వం ఈ చంద్రయాన్నే చేపట్టింది” అని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య మూల స్తంభాలైన మీడియా, న్యాయవ్యవస్థ లాంటివి ప్రభుత్వ సలహాదార్లతోనే నడుస్తున్నాయని, ఎన్నార్సీ తుది జాబితాలో అసలైన భారతీయులకు చోటు కల్పించలేదని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షసాధింపుల మీద ద ష్టి పెట్టేకంటే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపై ద ష్టి సారించండి అన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఉటంకించారు.