చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి ఓకే
న్యూఢిల్లీ: కరుడుగట్టిన నలుగురు టెరరిస్టులను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. జైష్-ఎ-మహ్మద్ అధినేత మసూద్, లష్కర్-ఎ-తయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై దాడుల సూత్రధారి జకీ-ఉర్-రహ్మాన్ లఖ్వీ, భారతలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దావూద్ ఇబ్రహీంలను కొత్త చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా పేర్కొంది.
కాగా..ఈ నిర్ణయానికి అమెరికా మద్దతు పలికింది. ”హింసకు కారణమవుతున్న ఆ నలుగురిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి మేం మద్దతు పలుకుతున్నాం. భారత్-అమెరికాలు కలిసి కట్టుగా ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ఈ చట్టం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నాం.’ అని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో అసిస్టెంట్ సెక్రెటరీ ఆలిస్ జి.వెల్స్ ట్వీట్ చేశారు. అమెరికాలో ఇప్పిటికే ఈ తరహా చట్టం ఉండటంతో.. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో ఇరు దేశాలూ మరింతగా సహకరించుకునే ఆస్కారం కలిగిందని అమెరికా రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.