10 లక్షల మందికి

నిలిచిపోయిన ‘రైతుబంధు’ 

నిధులు పూర్తిస్థాయిలో లేక తాత్కాలికంగా పథకం నిలిపేసిన అధికారులు 
  • రూ.2,500 కోట్లమేరకు అందాల్సిన డబ్బు 
  • అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీ.సర్కార్‌ 
  • గత ఎన్నికలలో ఇచ్చిన స్పష్టమైన హామీ 
  • ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న రైతులు కొంతమంది మాత్రమే 
  • ఖరీఫ్‌కు ముందే రైతులందరికీ అందిస్తామన్న సర్కార్‌ 
  • ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.13 వేల కోట్ల కేటాయింపు 
  • 53 లక్షల మంది రైతులకు 6,900 కోట్ల రూపాయలు అందజేత 
  • రైతుబంధు పథకం సొమ్ములు మింగేస్తున్న బ్యాంకులు 
  • గతంలో బకాయిలకు జమ చేసుకుంటున్న బ్యాంకు సిబ్బంది 

హైదరాబాద్‌: 
ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమైన ఖరీఫ్‌ సీజనుకు సంబంధించి రైతుబంధు పూర్తిస్థయిలో అందలేదు. ఇంకా పది లక్షల మంది రైతులకు రూ. 2,500 కోట్ల మేర డబ్బు అందాల్సి ఉంది. అయితే నిధులు పూర్తిస్థాయిలో లేకపోవడంవల్లే ప్రభుత్వం ప్రస్తుతానికి రైతుబంధు చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా… రైతుబంధుతో పాటు నిరుద్యోగ భతి చెల్లింపు, సొంతింటి నిర్మాణానికి సబ్సిడీ, పింఛన్ల పెంపు వంటి హామీలను టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు ఇచ్చిన విషయం విదితమే. వీటితో రైతుబంధు పథకాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది. అయితే ఈ సీజన్‌లో నిధుల కొరత మూలంగా చెల్లింపుల్లో జాప్యం జరగవచ్చని వినవస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతు బంధు పథకం కింద కొంత మంది రైతులకు మాత్రమే సొమ్ములు ముట్టాయి. వాస్తవానికి… జూన్‌ లోనే ప్రారంభమైన ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతుబంధు డబ్బును చెల్లించాల్సి ఉంది. కాగా 
ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో రైతు బంధు పథకానికి రూ.13 వేల కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 53 లక్షల మంది రైతులకు 6,900 కోట్ల రూపాయలు చెల్లించారు. మరో పది లక్షల మందికి చెల్లించడానికి ఆర్థిక శాఖ నుంచి వ్యవసాయ శాఖకు నిధులు విడుదల కావాల్సి ఉంది. సన్నచిన్నకారు రైతులకు చాలావరకు చెల్లింపులు జరిగాయి. అయితే పెద్ద కమతాల రైతులకు మాత్రం చెల్లింపులు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే… లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి మాత్రం ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. టీఆర్‌ఎస్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో మాత్రం ఈ పథకం కింద రూ. 17 వేల కోట్లను కేటాయించారు. ఇప్పడు మాత్రం రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరి కొద్ది రోజుల్లోనే ఈ చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. 
ఖరీఫ్‌ సీజన్‌ పంట పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న రైతుబంధు పథకం సొమ్మును బ్యాంకులు మింగేస్తున్నాయి. రైతు ఖాతాలో రైతుబంధు సాయం డిపాజిట్‌ కాగానే వాటిని బకాయిలు, వడ్డీల కిందకు జమ చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా రూ. 500 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సొమ్మును బ్యాంకులు లాగేసుకున్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారించుకుంది. దీనిపై అనేకమంది రైతులు ఇప్పటికే వ్యవసాయ శాఖకు రైతుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీంతో వ్యవసాయ శాఖ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద ష్టికి తీసుకెళ్లింది. 

రైతుబంధు సొమ్మును బకాయిలకు, వడ్డీలకు జమ చేసుకోవద్దని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి ప్రభుత్వం తరపున సూచించాలని కోరింది. ఇప్పటికే వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వ బడ్జెట్‌ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, రైతుల నుంచే ముక్కు పిండి వసూలు చేయడంపై సిఎం సీరియస్‌గా ఉన్నారు. ఇదే సమయంలో రైతుబంధు సాయాన్ని కూడా పాట పంట రుణాలకు కట్‌ చేసుకోవడంపై ఎస్‌ఎల్‌బిసికి గట్టిగానే చెప్పాలని నిర్ణయించారు. 

ఈ ఖరీఫ్‌లో 56.76 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హులుగా గుర్తించారు. ఇందుకోసం మొత్తం రూ. 7254 కోట్లు అవసరం. అయితే వ్యవసాయ శాఖ వద్ద 52.63 లక్షల మంది రైతుల వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 49.33 లక్షల మంది రైతులకు అందాల్సిన సాయం రూ.6537 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖకు సమర్పించగా, దాదాపు 40 లక్షల మంది రైతులకు రూ.4400 కోట్లు బదిలీ చేశారు. ఇంకా 9.30 లక్షల మందికి రూ.2100 కోట్లు జమ చేయాల్సి ఉంది. 

గత సీజన్‌లలో సాఫీగానే.. 
వాస్తవానికి రైతుబంధు పథకాన్ని 2018 ఖరీఫ్‌లో ప్రారంభానికి ముందు ప్రభుత్వం ద ష్టికి ఇవే అంశాలు వచ్చాయి. ఒకవేళ రైతుల ఖాతాల్లో జమ చేస్తే రుణమాఫీ మాదిరి వడ్డీలకు జమ చేసుకుంటే ఎలా ? ఒకవేళ మమూ లు చెక్కులు ఇస్తే వాటిని కూడా బ్యాంకులు బకాయిలకు జమ చేసుకునే అవకాశం ఉందని గుర్తించారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఆర్డర్‌ పే చెక్కులను ముద్రించి పంపిణీ చేశారు. అప్పుడు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. ఆర్డర్‌ పే చెక్కులకు నగదును ఖచ్చితంగా రైతు చేతికి ఇవ్వాలని, ఒకవేళ రైతులు పాత బాకీ కట్టాలనుకుంటే అది వారి ఇష్టానికి వదలేయ్యాలని ఎస్‌ఎల్‌బిసికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మొదటి విడత ఖరీఫ్‌ సీజన్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా రైతులకు పెట్టుబడి సాయం అందింది. 

ఆ తరువాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నేరుగా రైతుబ్యాంకు ఖాతా కు రైతుబంధును అందజేశారు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ను జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు మౌఖికంగా స్పష్టం చేయడం సాఫీగానే సాగిపోయింది. రెండో ఏడాది ఖరీఫ్‌లో కూడా చెక్కుల కంటే నేరుగా రైతు ల ఖాతాల్లో జమ చేయడమే సులభమని, అదే మార్గంలో పెట్టుబడి అందజేస్తున్నారు. అయితే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించడం ఇచ్చిన హామీ మేరకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు మొదటి విడతకు కేటాయించింది. 
కాకపోతే అందుకు సంబంధించి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు, నిధులు విడుదల చేయలేదు. దీంతో చాలామంది రైతులు మాఫీ కోసం ఎదురు చూస్తూ గతేడాది ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలను రెన్యువల్‌ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఒకవేళ పంట రుణం చెల్లిస్తే, మాఫీ వర్తిస్తదో లేదో అనే భయం అన్నదాతల్లో ఉంది. ఇదే అదునుగా భావించిన బ్యాంకులు రైతుబంధు కోసం జమ చేసిన సాయాన్ని పంట రుణాలకు, వడ్డీ బకాయిలకు మళ్లించుకుంటున్నాయి. 
ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాం.. 
వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా 
రైతుబంధు పథకం కింద రైతులకు జమ చేసిన పెట్టుబడి సాయాన్ని బ్యాంకులు బకాయిలు కింద జమ చేసుకున్నట్లు గుర్తించాం. దాదాపు రూ.500 కోట్లు వడ్డీలకు, బకాయిలకు మళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించాం. రైతుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం ద ష్టికి తీసుకెళ్లాం. పెట్టుబడి సాయాన్ని బకాయిలకు జమ చేసుకోవద్దని ఎస్‌ఎల్‌బిసికి చెప్పాలని కోరాము. 
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాలుపురం గ్రామానికి చెందిన దొంగరి వెంకన్న గత పదేండ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పోరాడి వరంగల్‌ సెంట్రల్‌జైల్‌లో శిక్ష అనుభవించిన వెంకన్నకు జలాలుపురం గ్రామంలోని సర్వే నంబర్‌ 401- లో 2 గుంటలు, 404- 3 లో 22 గుంటలు, 404-లో 23 గుంటలు, 404- లో 23 గుంటలు, 405- 1 లో 18 గుంటలు, 405- 3 లో 18 గుంటలు, 406- 2 లో 21 గుంటలు, 406- 3 లో 16 గుంటల భూమి ఉన్నది. మొ త్తం 3.26 ఎకరాల భూమికి వెంకన్న పేరి ట గతేడాది మేలో మొదటి విడుత రైతుబంధు కింద రూ.11,300 చెక్కు కూడా వచ్చింది. 
అర్వపల్లి పరిధిలోకి వచ్చిన జలాలుపురం గ్రామ వీఆర్వో.. వెంకన్నకు చెక్కు ఇవ్వకుండా తిప్పుకొన్నారు. చెక్కు కోసం అడిగితే.. చెక్కు తప్పుగా వచ్చిందని, భూమి విస్తీర్ణం తక్కువగా ఉన్నదంటూ వీఆర్వో తన దగ్గరే పెట్టుకొన్నారని వెంకన్న వాపోయారు. ఈ చెక్కును రద్దు చేసి, కొత్త చెక్కు వచ్చేలా చేస్తానంటూ తిప్పుకొంటున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. గతేడాది నుంచి రైతుబంధు చెక్కు కోసం తిరిగితే పట్టించుకోవడం లేదని, గ్రామసభలో కూడా విన్నవించుకొన్నానని, చివరకు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు కూడా విజ్ఞప్తి చేసుకొన్నానని బాధితు డు తెలిపారు. మూడు విడుతల్లో రైతు బం ధు చెక్కులు గ్రామంలో రైతులకు వచ్చాయని, కానీ తనకు మాత్రమే నిలిపివేస్తున్నారని వాపోయారు. పదేండ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ప్రతినెలా హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స చేయించుకొంటున్నానని వేడుకొంటున్నా అధికారులు కనికరం చూపడం లేదని వెంకన్న రోదిస్తున్నారు.