హైదరాబాద్ః నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసేందుకు దేశ తొలిహోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కష్టపడ్డారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా గర్తుచేశారు. భారత్లోకి ఎన్నోసంస్థానాలను విలీనం చేసేందుకు ఆయన చాలా శ్రమించారని అన్నారు. అలాగే దాశాబా?్ధలుగా సమస్యగా మారిన జమ్మూ, కశ్మీర్కు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ విముక్తి కల్పించిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుచేసి అక్కడి అభివ ద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ఆశయం నెరవేరిందని చెప్పారు. శనివారం సర్ధార్వల్లభాయ్పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన 70వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్పరేడ్ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్షా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈవేడుకలో ప్రొబేషనర్స్ కవాతును పరిశీలించి , ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రొబేషనర్లకు అమిత్షా బహుమతి ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం కోసం సరా?్ధర్పటేల్ చేసిన క షి మరువలేనిదని అన్నారు. స్వదేశీ సంస్థానాల విలీనంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. పోలీస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ సర్థార్పటేల్ ఉంటారని అన్నారు సర్వీసుల రూపకల్పనలోనూ పటేల్కీలక పాత్ర పోషించారన్నారు. సమాజంలోని పేదల అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆయన అభిలషించేవారన్నారు ఐపీఎస్ సాదించగానే ఆశయం నెరవేరినట్టు కాదని నిజాయితీగా పనిచేసి దేశాభివ ద్ధికి క షి చేయాలని కోరారు. రాజకీయ నాయకులు కేవలం ఐదేళ్లుమాత్రమే అధికారంలో ఉంటారని అదే పోలీసులు దాదాపు 30 ఏళ్లపాటు సర్వీసులో ఉంటారని అన్నారు. పేదల తరపున నిలిచి వారికి న్యాయం చేసేందుకు పోలీసులు క షి చేయాలని అన్నారు. పోలీసులు మనసు చెప్పినట్టు నడుచుకోవాలని అయితే ఎక్కడైనా రాజ్యాంగ స్పూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని సూచించారు. భారతమాత కోసం ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలు సాదించాలని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ స్వార్ట్ పోలీస్ మంత్రాన్ని ద ష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని కొత్త ఐపీఎస్ అధికారులకు హోంమంత్రి అమిత్షా సూచించారు. యువ అధికారులు అత్యంత అంకితభావంతో దేశానికి సేవ చేయడం ద్వారా భారతీయ పోలీసు సేవల విశిష్ట సంప్రదాయంలో భాగస్వాములు కావాలని కోరారు. మొత్తం 103 మంది అధికారుల్లో 15 మంది మహిళా అధికారులు, ఆరుగురు రాయల్భూటాన్ పోలీసులు, ఐదుగురు నేపాల్ పోలీస్ సర్వీస్ అదికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్రహోంమంత్రి మహమూద్అలీ తదితరులు పాల్గొన్నారు.