టాలీవుడ్లో అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించిన క్రేజీ జంట విజయ్దేవరకొండ, రష్మిక మండన్న. గతంలో వీరద్దరూ నటించిన గీతగోవిందం మంచి హిట్ సాధించింది. అదే జంట ఇప్పుడు డియర్ కామ్రేడ్లో నటించారు.భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 26న విడుదలయింది, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న మొదటి తెలుగు సినిమా ఇదే. ఇక ఈ చిత్ర విశేషాలు ఏంటి అన్నది చూద్దాం…
కథ:
కథలోకి వెళ్లినట్టయితే బాబీ(విజయ్ దేవరకొండ) నిజాయితీకల నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్.అలాంటి తాను స్టేట్ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి లిల్లి(రష్మిక)ను అనేక ప్రయత్నాల తర్వాత తన ప్రేమలో పడేస్తాడు. కానీ అతనికున్న ఆవేశం వల్ల ఈ ఇద్దరి మధ్య సమస్యలు లేవనెత్తి మధ్యన దూరం ఏర్పడుతుంది.ఈ సమస్యలన్నిటినీ బాబీ పరిష్కరించుకునే విధానం? ఇతని ఆవేశ స్వభావం లిల్లీ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపించింది ఆమె ఓ స్టేట్ ప్లేయర్గా తన సత్తాని చాటుతుందా లేదా. అన్నవి తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ :
విజయ్ కి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ని బట్టి విజయ్ నుంచి ఒక సినిమా వచ్చి చాలా కాలం కావడంతో విజయ్ అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అదే విధంగా ఏకకాలంలో నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చేసిన ప్రకటనలు అలాగే ప్రమోషన్స్ వల్ల అన్ని వర్గాల ప్రేక్షలుకులను కూడా ఈ సినిమా వైపు తిప్పుకున్నారు, ఫస్ట్ హాఫ్ లో విజయ్ మరియు రష్మికల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా కాస్త నెమ్మదిగా సాగినా క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగా చూపించాడు దర్శకుడు.
మొదటి సగం ముగిసే సరికి సినిమా పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉంది. కాలేజ్ ఎపిసోడ్స్ చాలా బావుంటాయి. కాలేజ్ డేస్ అనేవి దాదాపుగా అందరి లైఫ్లో ఉంటుంది. ఇక సెకండాఫ్ విషయానికి వచ్చినట్టైతే కథ పాతదే దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా బావుంది. సినిమా నిడివి పెద్దది కావడం మూలాన సెకండాఫ్ కూడా కాస్త స్లో గా అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఒక కాలేజ్ స్టూడెంట్ గా కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తిగా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని యువకునిగా విజయ్ అదరగొడతారు.అలాగే రష్మిక క్రికెట్ ప్లేయర్ గా మరియు కథకు తగ్గట్టుగా తన పాత్రలో ఇమిడిపోతుంది ఇక ఈ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ మరోసారి చక్కగా ఆట్టుకుంటుంది.విజయ్ లో అగ్రెసివ్ మోడ్ అక్కడక్కడా కనిపించడం అభిమానులకు కాస్త బూస్టప్ ఇస్తుంది.దర్శకుడు భరత్ ఎంచుకున్న కథలోని స్టైల్ అర్జున్ రెడ్డిలో కూడా చూసేసిన అనుభూతి కనిపిస్తుంది దానికి కాస్త కమ్యూనిస్ట్ భావజాలాలు జోడించి కొత్తగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకర్ అందించిన సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు సినిమాకు మరింత జీవం పోస్తాయి.
నటీనటులుః
విజయ్దేవరకొండ, రష్మికమండన్న, శ తిరామ్చంద్రన్, రావురమేష్, బ్రహ్మాజీ, సుకన్య తదితరులు నటించారు.
సాంకేతిక నిపుణులుః
కథ, దర్శకత్వంః భరత్కమ్మ, సంగీతంఃజస్టిన్ ప్రభాకర్, సినిమాటోగ్రఫీః శ్రీజిత్ సారంగ్, ప్రొడ్యూసర్ః మోహన్చెరుకూరి, మైత్రీమూవీమేకర్స్ నవీన్యార్నేని, వై.రవిశంకర్